గ్రామ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2021-12-07T06:40:31+05:30 IST
నిబంధలను పట్టించుకోని మండలంలోని గుంజలూరు గ్రామ పంచాయతీ కార్యదర్శిపై ప్రభుత్వం చర్యలు తీసుకో వాలని కోరుతూ ముగ్గురు వార్డు మెంబర్లు, గ్రామస్థులు డిమాండ్ చేశారు.
చివ్వెంల, డిసెంబరు 6: నిబంధలను పట్టించుకోని మండలంలోని గుంజలూరు గ్రామ పంచాయతీ కార్యదర్శిపై ప్రభుత్వం చర్యలు తీసుకో వాలని కోరుతూ ముగ్గురు వార్డు మెంబర్లు, గ్రామస్థులు డిమాండ్ చేశారు. అదే గ్రామంలోని ఓ వెంచర్ ఎదుట సోమవారం ధర్నా చేసి మాట్లాడారు. 12 ఎకరాల్లో వెంచర్కు అనుమతి తీసుకుని 60 ఎకరాల్లో అభివృద్ధి తీసుకుంటున్నా కార్యదర్శి ఎటువంటి చర్యలు తీసుకోవడంలేద న్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి బక్కయ్యను వివరణ కోరగా వెంచర్ అనుమతుల వివరాలను వార్డు సభ్యులకు తెలిపానన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సుంకరి ఉపేందర్, బొల్లికొండ సైదులు, ఐతరాజు రాంమళ్లు, గ్రామస్థులు పెదపోలు వీరయ్యగౌడ్, మొలుగూరి మదు, పవన్, కొప్పు లక్ష్మయ్యలు పాల్గొన్నారు.