లాఠీచార్జి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2020-10-16T06:31:32+05:30 IST
ఏబీవీపీ విద్యార్థి నాయకులపై లాఠీచార్జీ చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు ప్రభుత్వాన్ని
ఆమనగల్లు : ఏబీవీపీ విద్యార్థి నాయకులపై లాఠీచార్జీ చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్ ఆదేశానుసారం గురువారం ఆమనగల్లులో జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఎకనామికల్లీ వీకర్స్ సెక్షన్ స్కీమ్ ఎంపిక విషయంలో సమన్యాయం చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, జలసముద్రం వద్దకు వినతిపత్రాలు ఇవ్వడానికి వెళ్లిన ఏబీవీపీ కార్యాకర్తలపై సీఐ అజయ్ లాఠీచార్జీ చేసి గాయపరిచారని పేర్కొన్నారు. విచారణ జరిపించి బాధ్యలైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వినతి ఇచ్చిన వారిలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జల్లెల్ల శివ, పట్టణ కార్యదర్శి మల్లేశ్, భరత్, శివ, సాయి, మహేశ్, తదితరులు పాల్గొన్నారు.