మున్సిపల్‌ కమిషనర్‌పై చర్య తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-01-29T03:36:35+05:30 IST

చెన్నూరు మున్సిపల్‌ కమిషనర్‌ ఖాజామొహిజోద్దీన్‌ వేధింపుల కారణంగానే జిల్లెల సమత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని, వెంటనే కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని సమత కుటుంబ సభ్యులు శుక్రవారం చెన్నూరు-మంచిర్యాల జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

మున్సిపల్‌ కమిషనర్‌పై చర్య తీసుకోవాలి
రహదారిపై రాస్తారోకో చేస్తున్న సమత కుటుంబ సభ్యులు

చెన్నూరు, జనవరి 28 : చెన్నూరు మున్సిపల్‌ కమిషనర్‌ ఖాజామొహిజోద్దీన్‌ వేధింపుల కారణంగానే జిల్లెల సమత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని, వెంటనే కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని సమత కుటుంబ సభ్యులు శుక్రవారం చెన్నూరు-మంచిర్యాల జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకోకు కాంగ్రెస్‌ నాయకులు మద్దతు పలికారు.  కుటుంబ పోషణ కోసం చిరు వ్యాపారం చేసుకుంటూ ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్న సమతకు ఉపాధి దెబ్బతీసేలా మడిగను తొలగించడం  సరైంది కాదన్నారు. సమతకు ఏదైనా జరిగితే ఆమె పిల్లల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.  రాస్తారోకోతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో ఎస్‌ఐ వెంకటస్వామి సంఘటన స్థలానికి చేరుకుని రాస్తారోకో చేస్తున్న వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్‌ నాయకులు గజ్జెల అంకాగౌడ్‌, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-29T03:36:35+05:30 IST