‘బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి’

ABN , First Publish Date - 2021-06-13T04:51:36+05:30 IST

మాచారెడ్డి మండలంలోని ఇసాయిపేట గ్రామంలో జరిగిన ఓ కేసులో దరఖాస్తుదారులు లక్ష్మీని బెదిరిస్తున్న నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఎస్పీ సోమనాథంకు మాలమహనాడు నాయకులు విన తిపత్రం అందజేశారు.

‘బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి’

కామారెడ్డిటౌన్‌, జూన్‌ 12: మాచారెడ్డి మండలంలోని ఇసాయిపేట గ్రామంలో జరిగిన ఓ కేసులో దరఖాస్తుదారులు లక్ష్మీని బెదిరిస్తున్న నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఎస్పీ సోమనాథంకు మాలమహనాడు నాయకులు విన తిపత్రం అందజేశారు. ఓ కేసు విషయంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదైన ఏ1, ఏ8 నిందితులను అరెస్టు చేయకుండా పోలీసులు జాప్యం చేస్తున్నారని, కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిందితుల ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ మాల మహనాడు జిల్లా అఽధ్యక్షుడు రాజనర్సు, ఎడ్లరాజు, అంబేద్కర్‌ సంఘం ఉపాధ్య క్షుడు రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-13T04:51:36+05:30 IST