ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2021-12-09T04:21:37+05:30 IST
సమయపాలన పాటించని ఉపాధ్యా యుల పై చర్యలు తీసుకోవాలని నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు బుధవారం డీఈవో కార్యాలయంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందించారు
- నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు
ఏసీసీ, డిసెంబరు 8: సమయపాలన పాటించని ఉపాధ్యా యుల పై చర్యలు తీసుకోవాలని నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు బుధవారం డీఈవో కార్యాలయంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడు తూ మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు జిల్లా కేంద్రంలో నివాసం ఉంటూ సమయపాలన పాటించకుండా విధులకు హాజరవుతున్నారని అన్నారు. ఉదయం 9 గంటలకు పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యా యులు 11 గంటలైనా హాజరు కావడం లేదన్నారు. మరికొందరు ఉపాధ్యాయులు కరీంనగర్, వరంగల్, గోదావరిఖని ప్రాంతాల నుంచి రాకపోకలు కొనసాగిస్తూ తరుచుగా విధులకు గైర్హాజరవుతున్నారన్నారు. ఇలాంటి ఉపాధ్యాయు లపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముడిమడుగుల శేఖర్, గోళ్ల మహేందర్ తది తరులు పాల్గొన్నారు.