కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2021-05-12T05:55:42+05:30 IST
గ్రామాల్లో కరోనా కట్టడికి అధికారులు చర్యలు తీసుకోవాలని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ అన్నారు.
పగిడ్యాల, మే 11: గ్రామాల్లో కరోనా కట్టడికి అధికారులు చర్యలు తీసుకోవాలని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ అన్నారు. మండలంలోని నెహ్రూనగర్ గ్రామంలోని సచివాలయంలో టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. గ్రామంలో వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారికి ఇతర పరీక్షలతోపాటు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ వివరాలను వైద్యాదికారులు బలరాం నాయక్ అడిగి ఎమ్మెల్యే తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా నివారణకు అధికారులు కట్టుదిలమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. 5, 7 వవార్డుల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు ఆయనకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గౌరిదేవి, సీఐ ప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ జోగన్న, ఎస్ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.