పార్కుల అభివృద్ధికి చర్యలు
ABN , First Publish Date - 2022-01-23T03:27:43+05:30 IST
పట్టణంలో పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే వరప్రసాద్రావు తెలిపారు. శనివారం స్థానిక సొసైటీ కాలనీలోని ఎన్టీఆర్ పార్కులో రూ. 8.50 లక్షలతో అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు.
గూడూరు, జనవరి 22: పట్టణంలో పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే వరప్రసాద్రావు తెలిపారు. శనివారం స్థానిక సొసైటీ కాలనీలోని ఎన్టీఆర్ పార్కులో రూ. 8.50 లక్షలతో అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పార్కులో వాకింగ్, యోగా, వ్యాయామాలు చేసుకునేందుకు, చిన్నారులుఆడుకునేందుకు, వృద్ధులు విశాంత్రి తీసుకునేందుకు వీలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. పనులవేగవంతానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో కమిషనర్ శ్రీకాంత్, బొమ్మిడి శ్రీనివాసులు, అన్నం మురళి, సుమన్రెడ్డి, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.