ప్రొక్లెయినర్‌ స్వాధీనం

ABN , First Publish Date - 2021-04-15T05:42:05+05:30 IST

అక్రమంగా కొండను తవ్వుతుండగా ప్రొక్లెయి నర్‌ను రెవెన్యూ అధి కారులు బుధవారం స్వాధీనం చేసుకొన్నా రు.

ప్రొక్లెయినర్‌ స్వాధీనం

భోగాపురం: అక్రమంగా కొండను తవ్వుతుండగా ప్రొక్లెయి నర్‌ను రెవెన్యూ అధి కారులు బుధవారం స్వాధీనం చేసుకొన్నా రు. మెరుకుపల్లి సమీపంలో కొండను అక్రమంగా  తవ్వుతున్న ట్లు స్థానికులు అధికారులకు ఫిర్యాదుచేశారు.  దీంతో రెవెన్యూ అధికారులు ప్రొక్లెయినర్‌ను స్వాధీనం చేసుకొని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా  అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్లు సమాచారం  మేర కు వెళ్లి పరిశీలించామని తహసీల్దార్‌ డి.రాజేశ్వరరావు ఆంధ్రజ్యోతికి తెలిపారు. ఇంటికి ఆనుకొని కొండ ఉండడంతో కొండచరియలు విరిగి పడతాయని తవ్వి  మట్టివేస్తున్నారని  తెలిపారు. అయితే అనుమతిలేకుండా తవ్వకాలు జరపడంతో వాల్టాచట్టం ప్రకారం అపరాధ రుసుము విధిస్తామన్నారు.

Updated Date - 2021-04-15T05:42:05+05:30 IST