అట్రాసిటీ కేసుపై ఏసీపీ విచారణ
ABN , First Publish Date - 2022-01-28T05:42:21+05:30 IST
మండల కేంద్రానికి చెందిన నలుగురిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ గురువారం విచారణ చేపట్టారు.
నెన్నెల, జనవరి 27: మండల కేంద్రానికి చెందిన నలుగురిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ గురువారం విచారణ చేపట్టారు. పోచమ్మ వాడకు చెందిన బండి రాకేష్, మల్లిక, మీనుగు లస్మయ్య, సుగుణలతో వారి పొరుగువారైన జంబి ధర్మయ్య, భీమక్కలకు ఇటీవల గొడవ జరిగింది. అప్పటి నుంచి తమను ఽకులం పేరిట దూషిస్తున్నారని భీమక్క, ధర్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధర్మయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. నలుగురిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఏసీపీ బాదిత కుటుంబంతో మాట్లాడారు. ఇరుగుపొరుగు వారితో గొడవ వివరాలను అడిగి తెలుసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. ఆయన వెంట బెల్లంపల్లి రూరల్ సీఐ జగదీష్, ఎస్సై సౌమ్య ఉన్నారు.