హరితహారం లక్ష్యాలు సాధించాలి : డీఎంఏ
ABN , First Publish Date - 2020-07-16T09:45:59+05:30 IST
ఆరో విడత హరితహారం లక్ష్యాలను సాధించాలని డీఎంఏ సత్యనారాయణ జీడబ్ల్యూఎంసీ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం
వరంగల్ సిటీ, జూలై 15: ఆరో విడత హరితహారం లక్ష్యాలను సాధించాలని డీఎంఏ సత్యనారాయణ జీడబ్ల్యూఎంసీ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జీడబ్ల్యూఎంసీ అధికారులతో హరితహారం, మరుగుదొడ్ల నిర్మాణం తదితర పనులను సమీక్షించారు.
ఒక ఎకరంలో వేయి మొక్కలు నాటాలని, మియావాకి ప్లాంటేషన్కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆగస్టు 15 నాటికి వరంగల్ నగరంలో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సీహెచ్.నాగేశ్వర్, ఎస్ఈ విద్యాసాగర్, ఇన్చార్జి ఎంహెచ్వో నారాయణరావు, సీహెచ్వో సునిత, డీసీ గోధుమల రాజు, సీపీ రాములు తదితరులు పాల్గొన్నారు.