టీడీపీ నేత అచ్చెన్నాయుడుకి ఏపీ హైకోర్టులో ఊరట

ABN , First Publish Date - 2021-12-20T22:14:43+05:30 IST

టీడీపీ నేత అచ్చెన్నాయుడుకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. విదేశాలకు వెళ్లడానికి ఏసీబీ కోర్టు అనుమతి తీసుకోవాలన్న ఆదేశాలను ఎత్తివేశారు.

టీడీపీ నేత అచ్చెన్నాయుడుకి ఏపీ హైకోర్టులో ఊరట

అమరావతి: టీడీపీ నేత అచ్చెన్నాయుడుకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. విదేశాలకు వెళ్లడానికి ఏసీబీ కోర్టు అనుమతి తీసుకోవాలన్న ఆదేశాలను ఎత్తివేశారు. ESI స్కామ్‌లో అచ్చెన్నాయుడుకి ఇదివరకు హైకోర్టు బెయిల్ లభించింది. ACB కోర్టులో విచారణ ముగిసేవరకు దేశం విడిచి వెళ్లరాదని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అచ్చెన్నాయుడి విజ్ఞప్తి మేరకు కండిషన్‌ను హైకోర్టు ఎత్తివేసింది. 

Updated Date - 2021-12-20T22:14:43+05:30 IST