వైసీపీ నేతలకు ఓటమి భయం: అచ్చెన్న

ABN , First Publish Date - 2022-04-09T21:02:06+05:30 IST

వైసీపీ లీడర్ నుంచి కేడర్ వరకూ ఓటమి భయం పట్టుకుందని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

వైసీపీ నేతలకు ఓటమి భయం: అచ్చెన్న

అమరావతి:  వైసీపీ లీడర్ నుంచి కేడర్ వరకూ ఓటమి భయం పట్టుకుందని  తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం అచ్చెన్న మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అరాచక పాలనపై ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడియత్నం హేయమన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తే తప్పా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతల అక్రమాలను చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మాపై దాడులు చేస్తే ఏం వస్తుంది? అని ప్రశ్నించారు. మూడేళ్లుగా అంగుళం అభివృద్ధి చేయని వైసీపీ నేతలను ఆ పార్టీ కేడర్ ప్రశ్నించాలని  అచ్చెన్నాయుడు అన్నారు. 

Updated Date - 2022-04-09T21:02:06+05:30 IST