సుప్రీం తీర్పుతోనైనా జగన్‌ తీరు మార్చుకోవాలి: అచ్చెన్న

ABN , First Publish Date - 2021-07-20T02:15:22+05:30 IST

అమరావతిలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరగలేదని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

సుప్రీం తీర్పుతోనైనా జగన్‌ తీరు మార్చుకోవాలి: అచ్చెన్న

అమరావతి: అమరావతిలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరగలేదని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజరాపు  అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిపై సుప్రీంకోర్టు తీర్పుతోనైనా సీఎం జగన్‌రెడ్డి తీరు మార్చుకోవాలన్నారు. అమరావతి రెక్కలు విరచడమే ధ్యేయంగా జగన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తుగ్లక్‌ నిర్ణయాలతో మూడు రాజధానులంటూ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. 

Updated Date - 2021-07-20T02:15:22+05:30 IST