ప్రజల్ని ముంచిన సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2020-04-10T18:42:54+05:30 IST

అమరావతి: ఏపీ సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్‌ని అప్పుల ఊబిలో నెట్టేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు విమర్శించారు.

ప్రజల్ని ముంచిన సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు: అచ్చెన్నాయుడు

అమరావతి: ఏపీ సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్‌ని అప్పుల ఊబిలో నెట్టేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు విమర్శించారు. ఒక్క ఏడాదిలో 77 వేల కోట్లు అప్పు చేసి ప్రజల్ని ముంచిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. రాష్ట్ర జీవనాడి పోలవరం నిర్మాణం ఆగిపోయిందని పేర్కొన్నారు. ఉన్న సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎత్తేస్తారన్నారు. ఇచ్చిన హామీలు సగానికి కోసి మోసం చేశారని... మరి అప్పు తెచ్చిన 77 వేల కోట్లు ఎలా మాయం అయ్యాయని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.


ఆఖరికి కార్పొరేషన్లు అడ్డుపెట్టుకొని 16 వేల కోట్లు అప్పు తెచ్చారని విమర్శించారు. కానీ ఆయా వర్గాల అభ్యున్నతికి ఒక్క రూపాయి కూడా వైసీపీ ప్రభుత్వం వెచ్చించలేదన్నారు. కాంట్రాక్టర్లపై జగన్ గారు చూపిస్తున్న ప్రేమ.. ప్రజలపై చూపించాలన్నారు. కరోనా దెబ్బకి సామాన్యుడు ఉపాధి లేక అల్లాడుతున్నాడని విమర్శించారు. కనీసం ఇప్పుడైనా పేదలకు ఢిల్లీ ప్రభుత్వం తరహాలో 5 వేలు ఇచ్చి ఆదుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Updated Date - 2020-04-10T18:42:54+05:30 IST