పెగాసెస్పై అసెంబ్లీలో చర్చ జరగాలి: అచ్చెన్నాయుడు
ABN , First Publish Date - 2022-03-21T18:15:22+05:30 IST
పెగాసెస్ సాఫ్ట్ వేర్పై అసెంబ్లీలో చర్చ జరగాలని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు.
అమరావతి: పెగాసెస్ సాఫ్ట్ వేర్పై అసెంబ్లీలో చర్చ జరగాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం ఆయన సభలో మాట్లాడుతూ శాసనసభలో చర్చ జరిపి నిజానిజాలు ప్రజలకు చెప్పాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై బురద చల్లేందుకే పశ్చిమబెంగాల్ సీఎం మమతతో ఫేక్ మాటలు చెప్పించారని ఆయన విమర్శించారు. పెగాసెస్ సాఫ్ట్వేర్పై పార్లమెంట్లో జరిగిన చర్చపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎందుకు మాట్లాడలేదని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.