ప్రాణాలు పోతేపోని అన్నట్లుగా జగన్రెడ్డి వ్యవహరిస్తున్నారు: అచ్చెన్న
ABN , First Publish Date - 2022-03-16T19:14:11+05:30 IST
జంగారెడ్డిగూడెంలో మద్యం మరణాలకు పులుస్టాప్ పెట్టాలని టీడీపీ నేత అచ్చెన్నాయుడు కోరారు.
అమరావతి: జంగారెడ్డిగూడెంలో మద్యం మరణాలకు పులుస్టాప్ పెట్టాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కోరారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రాణాలు పోతేపోని అన్నట్లుగా సీఎం జగన్రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో షాపులు తగ్గితే మద్యం ఆదాయం తగ్గాలి.. కానీ పెరిగిందన్నారు. చంద్రబాబు పాలనలో మద్యంపై రూ.6 వేల కోట్లు వస్తే.. జగన్ పాలనలో రూ.16.500 కోట్లు వస్తోందన్నారు.
అసెంబ్లీలో ఆధారాలతో సహా నిరూపిస్తే సీఎం జగన్ తప్పుడు మాటలు మాట్లాడారని అచ్చెన్నాయుడు విమర్శించారు. జంగరెడ్డిగూడెంలో సారా దొరికిందని సెబ్ అధికారులే ప్రకటించారన్నారు. సెబ్ అధికారుల ప్రకటనను తాము సభలో ప్రశ్నిస్తే మమ్మల్ని సస్పెండ్ చేశారని, సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్ను సస్పెండ్ చేయాలని అచ్చెన్నాయుడు అన్నారు.