కోన వెంకట్రావును వైసీపీ గూండాలే పొట్టన బెట్టుకున్నారు: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2022-03-08T19:59:26+05:30 IST

టీడీపీ నేత కోన వెంకట్రావును వైసీపీ గూండాలే పొట్టన బెట్టుకున్నారని అచ్చెన్నాయుడు అన్నారు.

కోన వెంకట్రావును వైసీపీ గూండాలే పొట్టన బెట్టుకున్నారు: అచ్చెన్నాయుడు

అమరావతి: టీడీపీ నేత కోన వెంకట్రావును వైసీపీ గూండాలే పొట్టన బెట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వేధింపుల వల్లే వెంకట్రావు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియాలో ఎత్తిచూపినందుకే వేధింపులకు గురిచేశారని మండిపడ్డారు. మహిళా దినోత్సవం రోజున వైసీపీ నేతలు ఒక మహిళ మంగళసూత్రాన్ని తెంచేశారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బాధ్యులైన వైసీపీ నేతలు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. వైసీపీ గూండాలకు పోలీసులు రక్షకులుగా మారారని అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు.

Updated Date - 2022-03-08T19:59:26+05:30 IST