Ayyannaపై సీఎం Jagan కక్ష సాధింపు: Achannaidu
ABN , First Publish Date - 2022-06-19T15:38:51+05:30 IST
టీడీపీ నేత అచ్చెన్నాయుడు సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
Amaravathi: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Achannaidu) సీఎం జగన్మోహన్ రెడ్డి (Jaganmohan reddy) పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వం ఆదివారాన్ని విధ్వంస దినంగా మార్చారని విమర్శించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న టీడీపీ నాయకుడు అయ్యన్నపాత్రుడి (Ayyanna)పై ముఖ్యమంత్రి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. ప్రజా క్షేత్రంలో ఎదుర్కొనే ధైర్యం లేక విధ్వంసాలు, విద్వేషాలు, కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రాన్ని అస్తవ్యస్థంగా చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ గూండారాజుగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు. అధికారంలో ఉన్న పక్షానికి పోలీసులు మద్దతుగా నిలిస్తే.. ఆ తరువాత టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే పోలీసులు, అధికారులు వడ్డీతో సహా మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. జగన్ పాలనలో ఆగడాలు, అకృత్యాలు కోకొల్లలని, పోలీసుల అతిప్రవర్తన హద్దు అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. నేరస్థుడు రాజ్యం ఏలితే ఎన్ని అనర్ధాలు చోటు చేసుకుంటాయో, అరాచక శక్తులు ఏ విధంగా చెలరేగిపోతాయో, ఆర్ధిక వ్యవస్థ ఏ విధంగా నాశనమవుతుందో మూడేళ్లలో జగన్ రెడ్డి పాలనలో జరిగిన ఉదంతాలే నిదర్శనమని అచ్చెన్నాయుడు అన్నారు.