పోలీసులు తెల్ల పేపర్ మీద మా సంతకాలు తీసుకున్నారు: రాజు భార్య
ABN , First Publish Date - 2021-09-16T20:55:40+05:30 IST
ఆరేళ్ల చిన్నారి హత్యాచార కేసు నిందితుడు పులికొండ రాజు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే.
యాదాద్రి-భువనగిరి: ఆరేళ్ల చిన్నారి హత్యాచార కేసు నిందితుడు పులికొండ రాజు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై నిందితుడు రాజు భార్య మౌనిక అడ్డగూడూరు మండల కేంద్రంలో ఏబీఎన్తో మాట్లాడింది. తన భర్తను పోలీసులే చంపేశారంటూ అనుమానం వ్యక్తం చేసింది. తనకు, తన బిడ్డకు, అత్తకు న్యాయం చేయాలని వేడుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘‘మమ్మల్ని పోలీస్ స్టేషన్లో 10 రోజులు ఉంచారు. ఒకసారి దొరికాడని చెప్పారు.. ఇంకోసారి దొరకలేదన్నారు. నిన్న తెల్ల పేపర్ మీద సంతకాలు పెట్టించుకున్నారు. ఎందుకు సర్ అని అడిగితే ఊరికే అని చెప్పారు. నిన్న ఉప్పల్ దాకా తీసుకొచ్చి బస్ ఎక్కిచ్చి డబ్బులిచ్చారు. అప్పుడు వీడియో కూడా తీశారు. పోలీసులే చంపేశారని అనుకుంటున్నాం. ఇప్పుడు నా పాపతో నేను ఎలా బతకాలి. మమ్మల్ని చూసేవాళ్లు కూడా ఎవరూ లేరు. మాకు న్యాయం చేయాలి’’ అని వేడుకుంది.