17 ఏళ్ల బాలికపై అత్యాచారం.. కోర్టు తీర్పు విని జైల్లోకి వెళ్లకముందే 24 ఏళ్ల యువకుడి ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-06-25T21:08:17+05:30 IST

అతడు రెండేళ్ల క్రితం ఓ బాలికను కిడ్నాప్ చేసి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు..

17 ఏళ్ల బాలికపై అత్యాచారం.. కోర్టు తీర్పు విని జైల్లోకి వెళ్లకముందే 24 ఏళ్ల యువకుడి ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..

అతడు రెండేళ్ల క్రితం ఓ బాలికను కిడ్నాప్ చేసి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. అనంతరం పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు.. కేసు కోర్టు విచారణలో ఉండగా బెయిల్‌పై బయటకు వచ్చాడు.. తనకు 20 ఏళ్ల జైలు శిక్ష పడినట్టు శుక్రవారం తుదితీర్పు వెలువడడంతో కుంగిపోయాడు.. జైలుకు వెళ్లక ముందే విషం తాగేసి తనకు తాను మరణ శిక్ష విధించుకున్నాడు.. మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురంలో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

తనను తానే పెళ్లాడిన యువతి గురించి విన్నారుగా.. ఇప్పుడు తాజాగా మరో యువతి ఎవరిని వివాహం చేసుకుందో తెలిస్తే..


మధ్యప్రదేశ్‌లోని రాయ్‌పూర్‌కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన రాజా కహర్ 2020 జూలై 4న తన ప్రాంతానికే చెందిన ఓ 17 ఏళ్ల మైనర్‌ బాలికని కిడ్నాప్ చేశాడు. ఆమెను బీహార్‌కు తీసుకెళ్లి అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు రాజా కహర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు స్పెషల్ కోర్టులో విచారణలో ఉన్న సమయంలో రాజా బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈ కేసులో శుక్రవారం స్పెషల్ కోర్టు తుదితీర్పు వెలువరించింది. నిందితుడికి న్యాయమూర్తి 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు.


శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పోలీసులు అతడిని కోర్టు నుంచి జైలుకు తీసుకెళ్లారు. జైలు ప్రధాన ద్వారం దగ్గర అకస్మాత్తుగా అతడి ఆరోగ్యం క్షీణించింది. పోలీసులు రాజాను వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాత్రి 8 గంటలకు రాజా మృతి చెందాడు. కోర్టుకు వచ్చేటప్పుడే రాజా తనతో పాటు విషం తీసుకొచ్చి ఉంటాడని, 20 ఏళ్ల జైలు శిక్ష పడినట్టు తెలుసుకుని అది తాగేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. 

Updated Date - 2022-06-25T21:08:17+05:30 IST