అర్హత కలిగిన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు

ABN , First Publish Date - 2022-07-03T06:03:10+05:30 IST

జిల్లాలో అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌ కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్‌ టి. వినయ్‌కృష్ణారెడ్డి స్పష్టంచేశారు.

అర్హత కలిగిన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు
అక్రిడిటేషన్‌ కమిటీ సభ్యులతో కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

సూర్యాపేట (కలెక్టరేట్‌), జూలై 2: జిల్లాలో అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌ కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్‌ టి. వినయ్‌కృష్ణారెడ్డి స్పష్టంచేశారు. 2022-24 సంవత్సరానికి ప్రభుత్వం జర్నలిస్టులకు అందజేస్తున్న అక్రిడేషన్‌ కార్డులకు సంబంధించి మొ దటి విడతపై అక్రిడిటేషన్‌ కమిటీ సభ్యులతో శనివారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్‌ కార్డు అందజేస్తుందని  తెలిపారు. మొదటి విడతలో 383 మంది జర్నలిస్టులను ఎంపిక చేయడం జరిగిందని, వీరికి త్వరలోనేకార్డులు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు పౌర సంబంధాల అధికారి అబీబ్‌, కమిటీ సభ్యులు మిక్కిలినేని శ్రీనివాస్‌రావు, వజ్జె వీరయ్య, ఐతగాని రాంబాబుగౌడ్‌, అంజన్‌, చల్లా చంద్రశేఖర్‌, శ్యాంసుందర్‌రెడ్డి, యాకయ్య, ఆర్టీసీ డీఎం శివశంకర్‌ ఉన్నారు. 

Updated Date - 2022-07-03T06:03:10+05:30 IST