లంచం తీసుకుంటుండగా పట్టుబడిన సీనియర్ అకౌంటెంట్
ABN , First Publish Date - 2022-06-04T23:00:03+05:30 IST
Hyderabad: నాంపల్లి పెన్షన్ ఆఫీస్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేశారు. సీనియర్ అకౌంటెంట్ వెంకట సత్య నాగ ప్రసాద్ రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా
Hyderabad: నాంపల్లి పెన్షన్ ఆఫీస్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేశారు. సీనియర్ అకౌంటెంట్ వెంకట సత్య నాగ ప్రసాద్ రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అయేషా సిద్దికా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు. వారి మరణం తరువాత వచ్చే బెనిఫిట్స్ కోసం ఏడాది క్రితం దరఖాస్తు చేసుకుంది. అయితే అకౌంటెంట్ ప్రసాద్ రూ. 27 వేలు లంచం అడగడంతో మొదట అయేషా సిద్దికా రూ. 10 వేలు ఇచ్చింది. మిగతా డబ్బు తీసుకుంటుండగా ప్రసాద్ను అధికారులు పట్టుకున్నారు.