రేవంత్‌రెడ్డి కాన్వాయిలో ఢీ కొన్న కార్లు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

ABN , First Publish Date - 2022-03-20T23:48:47+05:30 IST

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాన్వాయికి పెనుప్రమాదం తప్పింది. తూప్రాన్ మండలం ఇమాంపూర్‌లో కాన్వాయిలోని కార్లు ఒక్కదానికొకటి ఢీకొన్నాయి.

రేవంత్‌రెడ్డి కాన్వాయిలో ఢీ కొన్న కార్లు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

మెదక్‌: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాన్వాయికి పెనుప్రమాదం తప్పింది. తూప్రాన్ మండలం ఇమాంపూర్‌లో కాన్వాయిలోని కార్లు ఒక్కదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నాలుగు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో రేవంత్‌రెడ్డి సురక్షితంగా బయటపడ్డారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి వెళ్తుండగా ఘటన జరిగినట్లు చెబుతున్నారు. ఎవరికీ ఎలాంటి హానీ జరుగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. రేవంత్ మరో వాహనంలో ఎల్లారెడ్డికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆదివారం ‘మన ఊరు మన-పోరు’ పేరుతో ఎల్లారెడ్డిలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ నేతలు బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నట్లు సభకు ఏర్పాట్లు కూడా చేశారు. ఈ సభకు రేవంత్‌రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.

Updated Date - 2022-03-20T23:48:47+05:30 IST