ప్రమాదాల నివారణ అందరి బాధ్యత

ABN , First Publish Date - 2021-01-19T05:17:59+05:30 IST

ప్రమా దాల నివారణకు ప్రతిఒక్కరూ బాధ్యత వహించా లని ఉమ్మడి జిల్లా ఉపరవాణా కమిషనర్‌ మామిళ్ల చంద్రశేఖర్‌గౌడ్‌ అన్నారు

ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
మాట్లాడుతున్న ఉపరవాణా కమిషనర్‌ మామిళ్ల చంద్రశేఖర్‌గౌడ్‌

 ఉమ్మడి జిల్లా ఉపరవాణా కమిషనర్‌ మామిళ్ల చంద్రశేఖర్‌గౌడ్‌


భగత్‌నగర్‌/తిమ్మాపూర్‌, జనవరి 18: ప్రమా దాల నివారణకు ప్రతిఒక్కరూ బాధ్యత వహించా లని ఉమ్మడి జిల్లా ఉపరవాణా కమిషనర్‌ మామిళ్ల చంద్రశేఖర్‌గౌడ్‌ అన్నారు. సోమవారం ఆర్టీసీ డిపో- 2లో జాతీయ రోడ్డుభద్రతా మాసోత్సవాల ప్రారం భంలో పాల్గొనిమాట్లాడారు. ప్రతియేటా దేశవ్యా ప్తంగా రోడ్డు ప్రమాదాల వల్ల 1,50,000 మరణాలు సంభవిస్తున్నాయన్నారు. మానవ తప్పిదాల వల్లే అధికశాతం ప్రమాదాలు సంభవిస్తున్నా యన్నారు. ఆర్టీసీ ఆర్‌ఎం అంచూరి శ్రీధర్‌ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లు అప్ర మత్తంగా ఉండాలన్నారు. అంతకుముందు తిమ్మాపూర్‌ మండల కేంద్రంలోని జిల్లా రవాణాశాఖ కార్యాల యంలో జరిగిన రహదారి భద్రతా మాసోత్సవాల్లో పాల్గొన్న జిల్లా ఉపరవాణా కమిషనర్‌ మామిళ్ల చంద్రశేఖర్‌గౌడ్‌ కరపత్రాలను ఆవిష్కరించారు. డివిజనల్‌ మేనేజర్‌ ఎ రవిశంకర్‌రెడ్డి, డిపో మేనేజర్లు ఎల్‌ మల్లేశం, పి అర్పిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-19T05:17:59+05:30 IST