నాగార్జునసాగర్లో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
ABN , First Publish Date - 2020-08-05T03:54:27+05:30 IST
నాగార్జునసాగర్ సమ్మక్క సారక్క దేవాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకతను మృతి చెందగా, అతని భార్య తీవ్రంగా గాయపడింది. పోలీసులు తెలిపిన వివరాల
నల్లగొండ : నాగార్జునసాగర్ సమ్మక్క సారక్క దేవాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకతను మృతి చెందగా, అతని భార్య తీవ్రంగా గాయపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు దంపతులు బైక్పై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం వారి బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో భర్త రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందగా, అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో కమలా నెహ్రూ ఆస్పత్రికి తరలించారు. బాధితులు ఒంగోలుకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.