ట్రాక్టర్‌ను ఢీ కొన్న లారీ.. ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-10-20T05:40:26+05:30 IST

నకరికల్లు అడ్డరోడ్డు నుంచి నరసరావుపేట వెళ్లే మార్గంలో దేచవరం రహదారి సమీపాన మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

ట్రాక్టర్‌ను ఢీ కొన్న లారీ.. ఒకరి మృతి
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మైనీడి వెంకట్రావు

నకరికల్లు, అక్టోబరు 19: నకరికల్లు అడ్డరోడ్డు నుంచి నరసరావుపేట వెళ్లే మార్గంలో దేచవరం రహదారి సమీపాన మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరసరావుపేట వైపుగా వడ్ల లోడుతో వెళుతున్న ట్రాక్టరును వెనుక వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ అదుపుతప్పి పొలాల్లోకి దూసుకుపోయింది. ట్రాక్టరులో ప్రయాణిస్తున్న మైనీడి వెంకట్రావు (58) అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్‌పై ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. స్థానిక రైతులు వడ్లబస్తాలను తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు వెంకట్రావు స్వగ్రామం నకరికల్లు మండలం కుంకలగుంట. వెంకట్రావుకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.  


Updated Date - 2021-10-20T05:40:26+05:30 IST