కాశీ వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం నిడదవోలు వాసి మృతి
ABN , First Publish Date - 2022-06-25T06:38:03+05:30 IST
కాశీ వెళ్లి తిరిగివస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో నలుగురు తీవ్ర గాయాలపాల య్యారు.
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు
మరో ఐదుగురికి తీవ్ర గాయాలు
నిడదవోలు, జూన్ 24 : కాశీ వెళ్లి తిరిగివస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో నలుగురు తీవ్ర గాయాలపాల య్యారు. నిడదవోలు పట్టణానికి చెందిన ఉండవల్లి శ్రీనివాసరావు (55), శ్రీదేవి దంపతులు ఈ నెల 13వ తేదీన నిడదవోలుకు చెందిన మరో ముగ్గురుతో కలిసి రైలులో కాశీకి వెళ్ళారు. అక్కడ దర్శనాలు పూర్తి చేసుకుని తిరిగి బయలుదేరే సమయానికి సికింద్రాబాద్లో జరిగిన అగ్నిపథ్ అల్లర్ల కారణంగా రైలు రద్దుకా వడంతో అక్కడే ఉండిపోయారు. వారిని తీసుకు వచ్చేందుకు ఈ నెల 20న మృతుడి కుమారుడు సూర్యకి రణ్ నిడదవోలు నుంచి కారు మాట్లాడుకుని కాశీకి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో గురువారం ఉదయం నాగ్పూర్ హైదరాబాద్ హైవేపై ఆగిఉన్న లారీని ఢీ కొనడంతో ఉండవల్లి శ్రీనివాసరావు(55) మృతి చెందగ భార్య శ్రీదేవి,మిగిలిన వారు గాయాలపాలయ్యారు. ప్రమాదంలో గాయప డిన వారు నాగపూర్ గవర్నమెంటు మెడికల్ కాలేజ్ హాస్పటల్లో చికిత్స పొందుతున్నట్లు బంధువులు తెలిపారు.దీంతో మృతుడి ఇంటి వద్ద బంధు వులంతా విషాధంలో మునిగిపోయారు.మృతుడికి ఒక కుమార్తె, కుమా రుడు ఉన్నారు. దీంతో నిడదవోలులో విషాదఛాయలు అలుముకున్నాయి.