రోడ్డు ప్రమాదంలో ట్రాన్సజెండర్ మృతి
ABN , First Publish Date - 2022-08-10T05:23:38+05:30 IST
ఖాజాగూడ వద్ద బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టిన సంఘటనలో ఓ ట్రాన్సజెండర్ మృతిచెందిన సంఘటన గచ్చిబౌలి పోలీ్సస్టేషన పరిధిలో జరిగింది.
రాయదుర్గం, ఆగస్టు9(ఆంరఽధజ్యోతి): ఖాజాగూడ వద్ద బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టిన సంఘటనలో ఓ ట్రాన్సజెండర్ మృతిచెందిన సంఘటన గచ్చిబౌలి పోలీ్సస్టేషన పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వైజాగ్కు చెందిన సుధాకర్ అలియాస్ మౌనిక ట్రాన్సజెండర్ స్నేహితురాలితో కలిసి ద్విచక్రవాహనంపై గచ్చిబౌలికి వస్తుండగా ఈఎ్ససీఐ వద్దకు రాగానే వాహనం అదుపు తప్పి డివైర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మౌనికను గచ్చిబౌలిలోని కేఆర్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్థారించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.