వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

ABN , First Publish Date - 2022-01-23T05:23:22+05:30 IST

జిల్లాలో వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాల్లో శనివారం ము గ్గురు మరణించారు. అనంతపురం-బళ్లారి ప్రధాన రహదారిపై కూడేరు మండలంలోని గొట్కూరు గ్రామ సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీ కొనడంతో మహబూబ్‌పీరా(38) మృతిచెందగా.. మరో నలుగురు గాయపడ్డారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

కూడేరు, జనవరి22: జిల్లాలో వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాల్లో శనివారం ము గ్గురు మరణించారు. అనంతపురం-బళ్లారి ప్రధాన రహదారిపై కూడేరు మండలంలోని గొట్కూరు గ్రామ సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీ కొనడంతో మహబూబ్‌పీరా(38) మృతిచెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన మేరకు... అనంతపురంలోని నీరుగంటి వీధికి చెందిన మహబూబ్‌పీరా తన స్నేహితులు అనిల్‌కుమార్‌, హిదయతుల్లా, మారుతి, వినోద్‌కుమార్‌రెడ్డితో కలిసి కారులో శనివారం ఉదయం 6 గంటల సమయంలో బళ్లారిలో బంధువుల ఫంక్షనకు బయల్దేరారు. గొట్కూరు గ్రామ సమీపంలోని మణిపాల్‌ స్కూల్‌ వద్ద రోడ్డుపై ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో మహబూబ్‌పీరా మృతి చెందగా, మిగతావారు గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. ఎస్‌ఐ సత్యనారాయణ, ఏఎ్‌సఐ శివశంకర్‌ సిబ్బందితో ప్రమాద స్థలానికి చేరుకుని, వివరాలు తెలుసుకున్నారు. మహబూబ్‌ పీరాకు భార్య వహీదాబేగం, పిల్లలున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.


కారు ఢీకొని ఒకరు..

అనంతపురం క్రైం: నగరంలోని తపోవనం సర్కిల్‌లో కారు ఢీకొని ఒకరు మృతి చెందారు. ట్రాఫిక్‌ పోలీసులు తెలిపిన మేరకు.. గార్లదిన్నె మండలం కేశవాపురం గ్రామానికి చెందిన రైతు చంద్రశేఖర్‌రెడ్డి (42) వ్యక్తిగత పనుల నిమిత్తం ద్విచక్రవాహనంపై అనంతపురం వచ్చాడు. పనులు ముగించుకుని మఽఽధ్యాహ్నం 2 గంటల సమయంలో నగరం నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. తపోవనం సర్కిల్లో రోడ్డు క్రాస్‌ చేస్తుండగా బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్లే కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో చంద్రశేఖర్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం 5 గంటల సమయంలో మృతిచెందాడు. ప్రమాదంపై ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య నాగవేణి, కుమార్తె ఉన్నారు.


లారీ కిందపడి ఒకరు..

ముదిగుబ్బ: స్థానిక ప్రజావైద్యశాల ఎదురుగా శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో గాండ్లవారిపల్లికి చెందిన కునుతూరు ఆదినారాయణ (50)మృతి చెందాడు. ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాలివి. కదిరి వైపు నుంచి అనంతపురానికి లారీ వె ళ్తోం ది. ఆదినారాయణ ద్విచక్రవాహనంలో వెళ్తూ ప్రమాదవశాత్తు లారీ వెనుక టైరు కిం ద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-01-23T05:23:22+05:30 IST