విశాఖలో వ్యాన్ బోల్తా.. 35 మందికి గాయాలు

ABN , First Publish Date - 2020-10-24T04:41:42+05:30 IST

విశాఖపట్నం : జిల్లాలోని జి.మాడుగుల మండలం మగతపాలెం వద్ద వ్యాన్ బోల్తా పడింది.

విశాఖలో వ్యాన్ బోల్తా.. 35 మందికి గాయాలు

విశాఖపట్నం : జిల్లాలోని జి.మాడుగుల మండలం మగతపాలెం వద్ద వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక మహిళ ఘటనాస్థలిలోనే మృతి చెందారు. మరో 35 మందికి గాయాలయ్యాయి. స్థానికులు, వాహనదారులు గమనించి క్షతగాత్రులను హుటాహుటిన స్థానికంగా ఉన్న పాడేరు ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే ఈ గాయపడిన వారిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.


గాయాలపాలైన వ్యక్తుల కుటుంబీకులు, బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందని పరిశీలించి.. కేసు నమోదు చేసుకున్నారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది..? ఈ ప్రమాదానికి కారణాలేంటి..? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-10-24T04:41:42+05:30 IST