‘పోలవరం’లో ప్రమాదం.. కార్మికుడి మృతి
ABN , First Publish Date - 2020-11-22T08:41:29+05:30 IST
‘పోలవరం’లో ప్రమాదం.. కార్మికుడి మృతి
పోలవరం, నవంబరు 21: పోలవరం ప్రాజెక్టు స్పిల్వే పైనుంచి శుక్రవారం రాత్రి బిహార్కు చెందిన కార్మికుడు మహ్మద్ ముర్తాజ(23) ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడి మృతి చెందాడు. కాంట్రాక్టర్లు స్పందించకపోవడంతో కార్మికులు ఆగ్రహానికి గురై సంఘటనా ప్రాంతంలో ఉన్న కాంట్రాక్టర్ల వాహనాలను ధ్వంసం చేశారు.