శానిటైజర్ వల్లే ప్రమాదం: సీపీఎం నేత మధు
ABN , First Publish Date - 2020-08-10T09:40:21+05:30 IST
స్వర్ణప్యాలెస్లో అగ్నిప్రమాదానికి శానిటైజరే కారణమని సిబ్బంది తెల్లవారుజామున శానిటైజేషన్ చేస్తుండగా మంటలు వ్యాపించాయని కరోనా బాధితులకు చికిత్స అందించడంలో
అమరావతి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): స్వర్ణప్యాలెస్లో అగ్నిప్రమాదానికి శానిటైజరే కారణమని సిబ్బంది తెల్లవారుజామున శానిటైజేషన్ చేస్తుండగా మంటలు వ్యాపించాయని కరోనా బాధితులకు చికిత్స అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లుగా హోటళ్లను తీసుకుని ప్రైవేటు ఆస్పత్రులు వేలాది రూపాయలు దోచుకుంటున్నాయని సీపీఎం నేత బాబూరావు ఆరోపించారు. ఖాళీగా ఉన్న విద్యాసంస్థలు, ఫంక్షన్ హాళ్లను ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.