రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-04-17T05:45:16+05:30 IST

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన మాచర్ల కంభంపాడు గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
శ్రీకాంత్‌ మృతదేహం

మాచర్ల, ఏప్రిల్‌ 16: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన మాచర్ల కంభంపాడు గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. మాచర్ల పట్టణంలోని యాదవ బజార్లో నివాసముంటున్న శ్రీకాంత్‌(23) ఓ ఆన్‌లైన్‌ సంస్థ డెలివరీబాయ్‌గా పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా  దిక్రవాహనంపై రెంటచింతల వెళుతుండగా మార్గమద్యంలోని కంభంపాడు వద్ద ఎదురుగా వస్తున్న ఓ కళాశాల వాహనం ఢీకొంది. ఈ ఘటనలో శ్రీకాంత్‌ తీవ్ర గాయాలై మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు  నమోదు చేశారు. 


Updated Date - 2021-04-17T05:45:16+05:30 IST