సూరత్‌లో ప్రమాదం.. సిటీలో విషాదం..

ABN , First Publish Date - 2021-01-25T07:15:55+05:30 IST

పుణ్యకార్య నిమిత్తం

సూరత్‌లో ప్రమాదం.. సిటీలో విషాదం..


ముషీరాబాద్‌/సికింద్రాబాద్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): పుణ్యకార్య నిమిత్తం గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌ ప్రాంతానికి వెళ్లిన నగరానికి చెందిన ఇద్దరి మృతి ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. గతంలో అడిక్‌మెట్‌ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈఓగా పని చేసి గతేడాది బదిలీపై వెళ్లి నల్లగొండ శ్రీనగర్‌కాలనీలో గల రేణుకా ఎల్లమ్మ దేవస్థానంలో ఈఓగా పని చేస్తున్న శ్రీనివాస్‌, ముషీరాబాద్‌ శ్రీమహంకాళి దేవాలయంలో క్లర్క్‌గా విధులు నిర్వహిస్తున్న డి.రమణ (47) ఈ ప్రమాదంలో మృతి చెందారు. శ్రీనివా్‌సకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె వైద్య విద్యను అభ్యసిస్తోంది. మిగతా ఇద్దరు కూడా చదువుకుంటున్నారు. రమణకు భార్య సంధ్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బల్కంపేటలో నివాసం ఉంటున్నారు. ఆయన శ్రీమహంకాళి దేవాలయంలో 13 సంవత్సరాలుగా క్లర్క్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రోజూ బల్కంపేటలోని తన నివాసం నుంచి అమ్మవారి దేవాలయానికి వచ్చి సేవలందించేవారు. ఆయన ప్రతి ఒక్కరితో కలివిడిగా ఉంటూ అందరివాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల తన తండ్రి బాలకృష్ణ షష్టిపూర్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. రమణ మృతి చెందిన విషయం తెలుసుకుని సన్నిహితులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

Updated Date - 2021-01-25T07:15:55+05:30 IST