చెరువులో పడి ఇంటర్‌ విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2021-01-16T05:46:45+05:30 IST

చెరువులో పడి ఇంటర్‌ విద్యార్థి మృతి

చెరువులో పడి ఇంటర్‌ విద్యార్థి మృతి

విస్సన్నపేట, జనవరి 15: గొర్రెలను కడిగేందుకు చెరువులో దిగిన ఇంటర్‌ విద్యార్థి అందులో జారి పడి మృతి చెందాడు. ఈ ఘటన తెల్లదేవరపల్లి సుగాలి తండాలో గురువారం జరిగింది. ఎస్సై లక్ష్మణ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ధారావతు కల్యాణ్‌ (16) గొర్రెలను కడిగేందుకు తాళ్ల చెరువుకు వెళ్లాడు. గొర్రెలు కడుగుతుండగా ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. కుమారుడు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు స్థానికుల సాయంతో గాలించారు. మృతదేహాన్ని చెరువులో గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 


Updated Date - 2021-01-16T05:46:45+05:30 IST