ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం

ABN , First Publish Date - 2020-12-06T05:04:41+05:30 IST

స్కూటర్‌ను ఆర్టీసీ బస్సు డీకొనడంతో బి.మఠం మండలం ముడమాలకు చెందిన బాలాజీ (14) దుర్మరణం చెందిన సంఘటన శనివారం సాయంత్రం మైదుకూరు మండలంలోని అక్కులా యపల్లె వద్ద చోటుచేసుకుంది.

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం
ప్రమాదంలో మృతిచెందిన బాలాజీ

మైదుకూరు, డిసెంబరు 5: స్కూటర్‌ను ఆర్టీసీ బస్సు డీకొనడంతో బి.మఠం మండలం ముడమాలకు చెందిన బాలాజీ (14) దుర్మరణం చెందిన సంఘటన శనివారం సాయంత్రం మైదుకూరు మండలంలోని అక్కులా యపల్లె వద్ద చోటుచేసుకుంది. పోలీసుల స మాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాలాజీ తన మేనత్త కొండమ్మ, మరో పాపతో కలిసి ద్విచక్ర వాహనంపై మైదుకూరు పట్టణ పరిధిలోని క్రిష్ణాపురానికి బయలుదేరాడు. మదురవాడ డిపోకు చెందిన బస్సు ప్రొద్దుటూరు నుంచి మదురవాడకు వెళుతూ అక్కులాయపల్లె వద్ద అదుపుతప్పి బాలాజీని ఢీకొంది. దీంతో బాలాజీ అక్కడికక్కడే దుర్మరణం చెందగా గాయపడిన కొండమ్మను ఆస్పత్రికి తరలించారు.పాప సురక్షితంగా బయ టపడిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2020-12-06T05:04:41+05:30 IST