ఫంక్షన్‌కు వెళుతూ.. మృత్యుఒడికి

ABN , First Publish Date - 2020-11-29T05:41:34+05:30 IST

లారీని తప్పించబోతూ.. దాని చక్రాల కింద పడి ఇద్దరు అన్నదమ్ములు మృత్యువాత పడ్డారు.

ఫంక్షన్‌కు వెళుతూ.. మృత్యుఒడికి

8 లారీని తప్పించబోయి  అన్నదమ్ముల దుర్మరణం

టి.నరసాపురం, నవంబరు 28 : లారీని తప్పించబోతూ.. దాని చక్రాల కింద పడి ఇద్దరు అన్నదమ్ములు మృత్యువాత పడ్డారు. పోలీసుల సమాచారం మేరకు.. దెందులూరు మండలం గోపన్నపాలెంకు చెందిన కొడుదల జాన్‌ కుమా రులు తంబి(29), సురేష్‌(27) టి.నరసాపురం మండలం బొర్రం పాలెంలో కలపర్తి చిట్టియ్య ఇంటిలో నిశ్చయ తాంబూలాల ఫంక్షన్‌కు శనివారం బైక్‌పై బయలుదేరారు.బొర్రంపాలెం–వల్లంపట్ల గ్రామాల మధ్య ఎదురుగా వచ్చిన లారీని తప్పించబోయిన వీరు అదుపు తప్పి లారీ కిందకు దూసుకుని వెళ్లారు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తర లించారు. చింతలపూడి ఎస్‌ఐ కె.వెంకన్న కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2020-11-29T05:41:34+05:30 IST