రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN , First Publish Date - 2020-11-28T05:34:01+05:30 IST

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ఘట్‌కేసర్‌ రూరల్‌: రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందిన ఘటన ఘట్‌కేసర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.   పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా నర్సంపేటకు చెందిన రాపోలు రజిత(40) గతకొంతకాలంగా నగరంలోని నాగోల్‌లో గల విజయపురికాలనీలో ఉంటుంది. కాగా తన కుమారుడు రాపోలు నాగరాజుతో వారి స్వగ్రామమైన నర్సంపేటకు వెళ్లి గురువారం రాత్రి  బైక్‌పై నాగోల్‌కు తిరిగి వస్తున్నారు. ఈక్రమంలో జోడిమెట్ల మేదా కంపెనీ సమీపంలో బైక్‌ అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో వెనుక కుర్చున్న రజిత తలకు బలమైన కావడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందింది. నాగరాజుకు ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ చంద్రబాబు తెలిపారు. 

Updated Date - 2020-11-28T05:34:01+05:30 IST