రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి
ABN , First Publish Date - 2020-10-19T09:40:20+05:30 IST
రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి
చిట్టినగర్, అక్టోబరు 18 : బైక్పై వెళుతున్న తల్లీకొడుకులను ఇటుకల లోడ్తో వెళుతున్న ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటన ఆదివారం కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిట్టినగర్ వీఎంసీ కాలనీలో నివసించే తాడిశెట్టి సామ్రాజ్యం (56) సితార ప్రాంతంలో డ్వాక్వా పారిశుధ్య కార్మికురాలిగా పని చేస్తోంది. ఆమె కుమారుడు వెంకటేశ్వరరావు(35) వీఎంసీ మలేరియా విభాగం సర్కిల్-1లో మేస్ర్తీ. రోజూ మాదిరిగా ఆదివారం ఉదయం తల్లీకొడుకు లిద్దరూ బైక్పై ఇంటి నుంచి పనికి బయలు దేరారు. చిట్టినగర్ జంక్షన్ నుంచి సితార వైపు వెళుతుండగా సొరంగం మధ్యలో చిట్టినగర్ వైపు నుంచి వేగంగా వస్తున్న ట్రాక్టర్ బైక్ను డీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న సామ్రాజ్యం, వెంకటేశ్వరరావు కింద పడిపోయారు. వీరి మీదకు ట్రాక్టర్ చక్రాలు ఎక్కడంతో వెంకటేశ్వరరావు అక్కడిక్కడే మృతి చెందగా, సామ్రాజ్యం హస్పటల్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. తల్లీకొడుకులిద్దరూ మృతి చెందటంతో వీఎంసీ కాలనీ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.