బైక్‌ను ఢీకొన్న లారీ.. అన్నాచెల్లెలు మృతి

ABN , First Publish Date - 2021-04-11T06:25:08+05:30 IST

బైక్‌ను ఢీకొన్న లారీ.. అన్నాచెల్లెలు మృతి

బైక్‌ను ఢీకొన్న లారీ.. అన్నాచెల్లెలు మృతి
నంది కొండయ్య

గుణదల/ గన్నవరం, ఏప్రిల్‌ 10: బైక్‌ను లారీ వెనుక నుంచి అతివేగంగా ఢీ కొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న అన్నాచెల్లెలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన రామవరప్పాడులో శనివారం జరిగింది. గన్నవరం మండలం తెంపల్లి గ్రామానికి చెందిన నంది కొండయ్య(42), పొంకు వెంకమ్మ(38) అన్నా చెల్లెల్లు. వీరిద్దరూ ఫంక్షన్లలో వంటలు చేస్తుంటారు. ఇబ్రహీంపట్నంలో వంట చేసేందుకు శనివారం మధ్యాహ్నం గన్నవరం నుంచి బైక్‌పై బయలుదేరారు. రామవరప్పాడుకు రాగానే డివైడర్‌ వద్ద బైక్‌ను వెనుక నుంచి గేదెల లోడుతో వస్తున్న లారీ అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది. తీవ్ర రక్తస్రావమై కొండయ్య, వెంకమ్మ అక్కడికక్కడే చనిపోయారు. పటమట, ట్రాఫిక్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. గంటసేపు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. తెంపల్లి గ్రామస్థులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 





Updated Date - 2021-04-11T06:25:08+05:30 IST