భూసేకరణ పరిహారంపై అభ్యంతరాల స్వీకరణ

ABN , First Publish Date - 2022-05-27T06:43:51+05:30 IST

చిట్యాల మండలం వెలిమినేడు శివారులో ఇండస్ర్టియల్‌ కోసం చేపట్టే భూసేకరణలో అసైన్డ్‌దారుల పరిహారం పెంపు కోసం నల్లగొండ ఆర్డీవో కార్యాలయంలో అభ్యంత రాలపై గురువారం విచారణ జరిగింది.

భూసేకరణ పరిహారంపై అభ్యంతరాల స్వీకరణ
అభ్యంతరాలు స్వీకరిస్తున్న ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి

చిట్యాలరూరల్‌, మే 26: చిట్యాల మండలం వెలిమినేడు శివారులో ఇండస్ర్టియల్‌ కోసం చేపట్టే భూసేకరణలో అసైన్డ్‌దారుల పరిహారం పెంపు కోసం నల్లగొండ ఆర్డీవో కార్యాలయంలో అభ్యంత రాలపై గురువారం విచారణ జరిగింది. 396, 415 సర్వే నంబర్లలోని అసైన్డ్‌దా రులు భూములు కోల్పోతున్నందున ప్రభుత్వ నిబంధనల మేరకు ఇచ్చే నష్టపరిహారంపై అసైన్డ్‌దారులు అభ్యంతరాలు తెలుపవచ్చని ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి సూచించారు. విచారణకు గ్రామం నుంచి పలువురు అసైన్డ్‌దారుడు హాజరై తమకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం తక్కువగా వస్తుందని తాము నష్టపోతామని పరిహారం పెంచాలని కోరగా ప్రభుత్వానికి అభ్యంతరాలు పంపిస్తామని ఆర్డీవో తెలిపారు. ప్రభుత్వ నిబంధన మేరకు భూసేకరణ జరుగుతుందని పరిహారంపై అసైన్డ్‌దారులు నల్లగొం డలోని ఆర్‌డీవో కార్యాలయంలో ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డికి అభ్యంత రాలు తెలపాలని చిట్యాల తహసీల్దార్‌ మాలి కృష్ణారెడ్డి తెలిపారు.

Updated Date - 2022-05-27T06:43:51+05:30 IST