ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి
ABN , First Publish Date - 2021-07-31T04:53:33+05:30 IST
జగనన్న కాలనీలోని ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని గృహ నిర్మాణ శాఖ జాయింట్ కలెక్టర్ ధ్యాన్చంద్ర అధికారులకు సూచించారు.
ప్రొద్దుటూరు రూరల్, జూలై 30: జగనన్న కాలనీలోని ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని గృహ నిర్మాణ శాఖ జాయింట్ కలెక్టర్ ధ్యాన్చంద్ర అధికారులకు సూచించారు. మండలంలోని మీనాపురం, బొల్లవరం, రామేశ్వరం జగనన్న కాలనీలను శుక్రవారం ఆయన సందర్శించారు. బొల్లవరం జగనన్న కాలనీలో వర్షం నీరు నిలబడిన ప్రాంతాన్ని చదును చేయాలని పేర్కొన్నారు. మరో 2,200 కొత్త ఇళ్లు మంజూరయ్యాయన్నారు. జగనన్న కాలనీలో విద్యుత్తు సౌకర్యాన్ని వెంటనే కల్పించాలని ట్రాన్స్కో అధికారులకు సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈ కృష్ణయ్య, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, తహసీల్దారు నజీర్అహమ్మద్, ట్రాన్స్కో ఈఈ శ్రీనివాసులరెడ్డి, ఏఈలు తదితరులు పాల్గొన్నారు