హౌసింగ్ నిర్మాణాలను వేగవంతం చేయండి : కలెక్టర్
ABN , First Publish Date - 2022-06-25T05:45:36+05:30 IST
జగనన్న ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా దృష్టి సారించాలని కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
తిరుచానూరు, జూన్ 24: జగనన్న ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా దృష్టి సారించాలని కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ జగనన్న హౌసింగ్ లే-అవుట్లలో సిమెంట్, ఇటుకలు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతులపై దృష్టి సారిం చాలని తెలిపారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన వినతుల పరిష్కారం అత్యంత ప్రాధాన్యత అంశంగా చూడాలన్నారు. రేషన్కార్డులు, పెన్షన్, హౌసింగ్కు సంబంధించి ఎక్కువ వినతులు వచ్చాయని, వీటిపై క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కార దిశగా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనుల్లో వందశాతం పురోగతి కనబరచాలన్నారు. సూళ్లూరుపేట ఆర్డీవో రోజ్మాండ్, డీఆర్వో శ్రీనివాసరావు, హౌసింగ్ పీడీ శర్మ, జిల్లా పంచాయతీ ఇంజనీర్ శంకర్నారాయణ పాల్గొన్నారు.