నిర్మాణ పనులు వేగవంతం చేయండి : డీపీవో
ABN , First Publish Date - 2021-06-19T05:23:06+05:30 IST
నిర్మాణ పనులు వేగవంతం చేయండి : డీపీవో
రేగిడి : గ్రామ సచివాలయాల పరిధిలో చేపడుతున్న అన్ని ప్రభుత్వ భవనాల పనులను వేగవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం చిన్నశిర్లాంలో భవన నిర్మాణ పక్షోత్సవ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనుల్లో నాణ్యత పాటించాలని, షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయాలని సూచించారు. స్థానిక సచివాలయ ప్రగతి భవనంతోపాటు రైతు భరోసా, వెల్నెస్, బల్క్మిల్స్ కేంద్రాల భవనాల పనులను అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట ఎంపీడీవో స్టీఫెన్సన్, జేఈ రామకృష్ణ తదితరులు ఉన్నారు.