ఖానాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంపై ఏసీబీ దాడులు

ABN , First Publish Date - 2021-07-31T07:04:01+05:30 IST

ఖానాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంపై శుక్రవారం ఏసీబి అధికారులు దాడులు నిర్వహించారు.

ఖానాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంపై ఏసీబీ దాడులు
ఖానాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఇదే

పలు రికార్డుల స్వాధీనం ఫ కార్యాలయంలో కొనసాగుతున్న విచారణ

ఖానాపూర్‌, జూలై 30 : ఖానాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంపై శుక్రవారం ఏసీబి అధికారులు దాడులు నిర్వహించారు. ఇటీవల కాలంలో ఖానాపూర్‌లో ఏసీబీ అధికారులు దాడులు చేస్తారని ముమ్మరంగా ప్రచారం జరిగింది. మండలంలోని ఓ విరాసత్‌పట్టాకు సంబంధించి తహసీల్దార్‌ డబ్బులు డిమాండ్‌ చేయడంతో బాదితుడు ఏసీబి అధికారులను సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఽశుక్రవారం ఖానాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో కరీంనగర్‌, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల ఏసీబీ డీఎస్పీ కె.భద్రయ్య ఆద్వర్యంలో ఏసీబి అధికారుల బృందం దాడులు జరిపింది. పలు రికార్డులను స్వాదీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ఓ వీఆర్‌ఏను అదుపులోకి తీసుకుని విచారించారు. తహసీల్దార్‌ నరేందర్‌ను డిప్యూటీ తహసీల్దార్‌ ఫారూఖ్‌ను సైతం అధికారులు విచారించినట్లు తెలిసింది. శుక్రవారం అర్దరాత్రి వరకు కూడా విచారణ కొనసాతోంది.. విచారణ పూర్తైతేనే పూర్తి వివరాలు వెలువడనున్నాయి. 


Updated Date - 2021-07-31T07:04:01+05:30 IST