ఏసీబీ కార్యాలయానికి షాబాద్ సీఐ, ఏఎస్ఐ తరలింపు
ABN , First Publish Date - 2020-07-10T19:41:19+05:30 IST
షాబాద్ సీఐ శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్ను ఏసీబీ అధికారులు ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఇప్పటికే శంకరయ్య ఇంట్లో రూ.3 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. 18 ఆస్తులకు
హైదరాబాద్: షాబాద్ సీఐ శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్ను ఏసీబీ అధికారులు ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఇప్పటికే శంకరయ్య ఇంట్లో రూ.3 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. 18 ఆస్తులకు సంబంధించిన డాక్యూమెంట్లను అధికారులు గుర్తించారు. మరోవైపు సీఐ శంకరయ్య నివాసంలో ఏసీబీ అధికారుల సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నేడు బ్యాంక్ లాకర్లను పరిశీలించనున్నారు. అదేవిధంగా ఇన్స్పెక్టర్ శంకరయ్యకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు గాను ఏసీబీ కార్యాలయం నుండి కింగ్ కోఠి ఆస్పత్రికి తరలించారు. కరోనా పరీక్షల అనంతరం మళ్లీ ఏసీబీ కార్యాలయానికి తరలించనున్నారు.