ఏసీబీకి పట్టుబడ్డ విద్యాశాఖ అధికారులు
ABN , First Publish Date - 2020-07-07T00:45:07+05:30 IST
తెలంగాణ విద్యాశాఖలో అవినీతి అధికారుల ఆట కట్టించారు ఏసీబీ అధికారులు. రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా ఇద్దరు అధికారులను ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
హైదరాబాద్: తెలంగాణ విద్యాశాఖలో అవినీతి అధికారుల ఆట కట్టించారు ఏసీబీ అధికారులు. రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా ఇద్దరు అధికారులను ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. స్కూలుకు ఎన్వోసీ జారీ చేసేందుకు సూపరింటెండెంట్ లక్ష్మణ్, జూనియర్ అసిస్టెంట్ విపిన్ లంచం డిమాండ్ చేశారు. దీంతో సదరు స్కూల్కు సంబంధించిన వ్యక్తులు అధికారులకు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు.