విజయనగరం జిల్లాలో రెండో రోజు ఏసీబీ తనిఖీలు

ABN , First Publish Date - 2021-07-21T17:00:22+05:30 IST

జిల్లాలో రెండో రోజు ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆరు తహశీల్దార్‌ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి.

విజయనగరం జిల్లాలో రెండో రోజు ఏసీబీ తనిఖీలు


విజయనగరం: జిల్లాలో రెండో రోజు ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆరు తహశీల్దార్‌ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ, శృంగవరపు కోట, జామి, కొత్తవలస తహశీల్దార్‌ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. తహశీల్దార్‌ కార్యాలయాల్లో పలు దస్త్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. 


ఏసీబీ అధికారులు రెవెన్యూ కార్యాలయాలపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా భూముల మార్కెట్‌ విలువ భారీగా ఉన్న మండలాలపై ఓ కన్నేశారు. జిల్లాలో జాతీయ రహదారి విస్తరించి ఉన్న భోగాపురం, డెంకాడ, పూసపాటిరేగ మండలాలతో పాటు మహా విశాఖ నగరాన్ని ఆనుకుని ఉన్న కొత్తవలస, జామి, ఎస్‌.కోట తహసీల్దార్‌ కార్యాలయాలపై ఏకకాలంలో మంగళవారం కూడా దాడులు నిర్వహించారు.

Updated Date - 2021-07-21T17:00:22+05:30 IST