అక్రమార్జన కేసులో Acb ఎదుట మాజీ మంత్రి హాజరు

ABN , First Publish Date - 2021-10-26T15:24:57+05:30 IST

అక్రమార్జన కేసులో అన్నాడీఎంకే మాజీ మంత్రి ఎంఆర్‌ విజయభాస్కర్‌ సోమ వారం ఉదయం ఏసీబీ అధికారుల విచారణకు హజరయ్యారు. విజయభాస్కర్‌ అన్నాడీఎంకే ప్రభుత్వ హాయంలో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. గత

అక్రమార్జన కేసులో Acb ఎదుట మాజీ మంత్రి హాజరు

చెన్నై(Tamilnadu): అక్రమార్జన కేసులో అన్నాడీఎంకే మాజీ మంత్రి ఎంఆర్‌ విజయభాస్కర్‌ సోమ వారం ఉదయం ఏసీబీ అధికారుల విచారణకు హజరయ్యారు. విజయభాస్కర్‌ అన్నాడీఎంకే ప్రభుత్వ హాయంలో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. గత జూలైలో ఎంఆర్‌ విజయభాస్కర్‌ నివాసగృహాలు, బంధువులు, స్నేహితుల నివాసగృహాలు సహా 21 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు జరిపారు. ఆ తనిఖీలలో అక్రమార్జనలకు సంబంధించి కీలకమైన దస్తావేజులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్‌ 30 తమ విచారణకు రమ్మంటూ ఏసీబీ అధికారులు సమన్‌ జారీ చేసినా విజయభాస్కర్‌ హాజరుకాలేదు. దీనితో అక్టోబరు 25న విచారణకు హాజరుకావాలని రెండోమారు ఏసీబీ అధికారులు ఆయనకు సమన్‌ జారీ చేశారు. ఆ మేరకు స్థానిక ఆలందూరు వద్దనున్న ఏసీబీ కార్యాలయానికి ఎంఆర్‌ విజయభాస్కర్‌ సోమవారం ఉదయం వెళ్ళారు. ఆ సందర్భంగా ఏసీబీ అధికారులు అక్రమార్జనలకు సంబంధించిన వివరాలపై ఆయనను ప్రశ్నించారు. తమ తనిఖీలలో పట్టుబడిన నగదుకు సంబంధించి కూడా అధికారులు ఆయన వద్ద విచారణ జరిపారు. సుమారు గంటకు పైగా ఈ విచారణ కొనసాగింది. విచారణ తర్వాత విజయభాస్కర్‌ కారెక్కి తన నివాసానికి బయల్దేరారు.

Updated Date - 2021-10-26T15:24:57+05:30 IST