కలెక్టర్ నగేష్తోపాటు నలుగుర్ని కస్టడీకి తీసుకోనున్న ఏసీబీ
ABN , First Publish Date - 2020-09-21T16:21:14+05:30 IST
మెదక్ అదనపు కలెక్టర్ నగేష్తోపాటు నలుగురు నిందితులను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు.
హైదరాబాద్: మెదక్ అదనపు మాజీ కలెక్టర్ నగేష్తోపాటు నలుగురు నిందితులను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. సోమవారం నుంచి నాలుగు రోజులపాటు వారిని విచారించనున్నారు. చంచల్గూడ జైల్లో ఉన్న ఐదుగురు నిందితులను మరి కాసేపట్లో ఏసీబీ కార్యాలయానికి తీసుకురానున్నారు.
ఏ1 మాజీ కలెక్టర్ నగేష్, ఏ2 వసీమ్, ఏ3 అరుణా రెడ్డి, ఏ4 అబ్దుల్ సత్తార్, ఏ5 జీవన్ గౌడ్లను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. మాజీ కలెక్టర్పై వస్తున్న ఆరోపణలను ఏసీబీ మరోసారి విచారణ చేయనుంది. అరస్టయిన ప్రభుత్వ అధికారులను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.